రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం గోవా-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సెంచరీతో మెరిశాడు. ఆడిన తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ చేయడం ద్వారా అర్జున్.. 34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్ని రిపీట్ చేశాడు. సచిన్ కూడా 1988 డిసెంబర్ 11న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు.