పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్ తన కెరీర్లో ఆడిన 120 టెస్టు మ్యాచ్ల్లో 49.60 సగటుతో 8830 పరుగులు చేయగా, ఇందులో 25 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో పాక్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ 124 మ్యాచ్ల్లో 52.57 సగటుతో 23 సెంచరీలు, 43 అర్ధసెంచరీలతో 8832 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వీరి రికార్డులను అధిగమిస్తూ.. 189 ఇన్నింగ్స్ల్లో 49.38 సగటుతో 29 సెంచరీలు, 30 అర్ధసెంచరీలతో 8836 పరుగులు చేశాడు.