భారత జట్టులోని ఆరుగురు ప్లేయర్లు 0 పరుగులకే ఔట్ అయి చెత్త రికార్డును నమోదుచేశారు. మ్యాచ్ చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా భారత్ 6 వికెట్లను కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయని భారత ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యార్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.