అద్భుతమైన ఫామ్లో విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 8 మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్లలో 322 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 64.40 సగటు, 140 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగింది. ఇందులో కోహ్లీ 4 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.
ఐపీఎల్ 2025లో కోహ్లీ చేజింగ్ లో కోల్కతా నైట్ రైడర్స్పై 36 బంతుల్లో అజేయంగా 62, రాజస్థాన్ రాయల్స్పై 45 బంతుల్లో అజేయంగా 62, పంజాబ్పై 43 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత ఐదు ఇన్నింగ్స్లలో కోహ్లీ నాలుగో హాఫ్ సెంచరీని సాధించడం విశేషం. ఈ 5 ఇన్నింగ్స్ లలో కోహ్లీ పరుగులు వరుసగా 59, 77, 92, 1, 73* గా ఉన్నాయి.