ఇప్పటికే బుమ్రా దూరం.. కోహ్లీ కూడా దూరం కానున్నాడా?
ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆడనున్న ఏకైక టోర్నీ. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అందుబాటులో ఉండాటా? లేదా అనే విషయం భారత్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో కోహ్లీ గాయం మరింత గందరగోళాన్ని పెంచుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో ప్రారంభం అవుతుంది. అయితే, భారత్ తన అన్ని మ్యాచ్లను ఫిబ్రవరి 20 నుండి దుబాయ్లో ఆడనుంది. కోహ్లీ మోకాలి గాయం అంత తీవ్రమైనది కాదనీ, ఇంగ్లాండ్తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్లలో ఆడటానికి అతను సిద్ధంగా ఉంటాడనీ జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.