ఏంటి ధోనీ... పిచ్ ఎలా ఉందో చూడడానికి వచ్చావా... మాహీ డకౌట్‌పై ట్రోలింగ్...

First Published Apr 11, 2021, 3:33 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ వరల్డ్‌లో అతనికి ఉండే క్రేజ్ అసామాన్యం. సచిన్ కంటే ఎక్కువగా మాస్ జనాల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ఇండియన్ మాజీ కెప్టెన్, రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు...

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మాహీ ఆటను చూసిన ధోనీ ఫ్యాన్స్... మళ్లీ ఇన్నాళ్లకు అతను క్రీజులో దిగుతుండడంతో ఎంతగానో ఎదురుచూశారు...
undefined
రెండో వికెట్ పడినప్పటి నుంచి మాహీ ఎప్పుడొస్తాడా? అని వెయిట్ చేయాల్సి వచ్చింది. త్రీ డౌన్‌లో అంబటి రాయుడిని పంపిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆరో స్థానంలో జడేజాను పంపాడు...
undefined
ఎట్టకేలకు రైనా రనౌట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, యంగ్ ప్లేయర్ అన్వేష్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
undefined
ఐపీఎల్ చరిత్రలోనే డకౌట్ కావడం ఇది నాలుగోసారి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్కోసారి డకౌట్ అయిన ధోనీ, ఢిల్లీపై రెండోసారి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు...
undefined
ఐపీఎల్‌లో 2015లో చివరిసారిగా డకౌట్ అయిన ధోనీ, 108 మ్యాచులు తర్వాత మళ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. క్రిస్ గేల్ 145 మ్యాచులు తర్వాత అత్యధిక టీ20 మ్యాచుల్లో డకౌట్ కాకుండా ఆడిన రెండో ప్లేయర్ మాహీయే...
undefined
అయితే రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయిన మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు...
undefined
మ్యాచ్ ఆరంభానికి ముందు రిషబ్ పంత్ అండ్ కోకి ఇలా ఆడాలి? అలా ఆడాలి? అంటూ స్పీచ్‌లు ఇస్తూ కనిపించిన ధోనీ, మైదానంలో మూడు బంతులు కూడా ఆడలేకపోయాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
undefined
మరికొందరైతే టాస్ కోసం క్రీజులోకి వచ్చిన ధోనీ, మళ్లీ బ్యాటు పట్టుకుని పిచ్ ఎలా ఉందో చూడడానికి మైదానంలోకి అడుగుపెట్టి ఉంటాడని విమర్శిస్తున్నారు...
undefined
అయితే ఇలాంటి విమర్శలు చేస్తున్నవారికి అదే రేంజ్‌లో స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు...రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 13 సార్లు డకౌట్ కాగా, ఏబీ డివిల్లియర్స్ 9 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
undefined
విరాట్ కోహ్లీ కూడా ఐదు సార్లు డకౌట్ అయ్యాడు. అలాంటిది నాలుగోసారి డకౌట్ అయిన మాహీపై ఇలాంటి ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు...
undefined
క్రికెట్ విశ్లేషకులు కూడా మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందు వచ్చి ఉంటే, ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉండేందని అభిప్రాయపడుతున్నారు...
undefined
2011 వరల్డ్‌కప్‌లో టీమిండియాకి పటిష్టమైన భాగస్వామ్యం ఏర్పడిన తర్వాత తనకి తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చుకున్న ధోనీ, ఇప్పుడెందుకు అలా చేయడం లేదని ట్రోల్ చేస్తున్నారు యువీ అభిమానులు...
undefined
గత ఏడాది బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అయి ట్రోలింగ్‌కి గురైన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే విమర్శకులకు టార్గెట్ అయ్యాడు.
undefined
ఐపీఎల్ మాత్రమే ఆడుతూ దేశవాళీ టోర్నీలకు దూరంగా ఉంటున్న ధోనీ, బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఆ టోర్నీల్లో కూడా పాల్గొంటే రిజల్ట్ బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు...
undefined
సురేశ్ రైనా, అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత దేశవాళీ టోర్నీల్లో ఆడుతుంటే... మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
undefined
click me!