నిరాశపర్చిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్
కోల్ కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ఆరంభం అందించారు. దీంతో భారత జట్టు చాలా ఈజీగానే విజయాన్ని అందుకుంది. అయితే, చెన్నైలో 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు.
చెపాక్ స్టేడియంలో అభిషేక్ శర్మ సిక్సర్ల మోత మోగలేదు. సంజూ శాంసన్ ఆరంభం అదరలేదు. వీరిద్దరూ త్వరగానే పెవిలియన్ కు చేరారు. అభిషేక్ శర్మ 12 పరుగులు, సంజూ శాంసన్ 5 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్, ధృవ్ జురేల్ లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరారు.