స్టార్ ప్లేయర్ల ఫ్లాప్ షో
359 పరుగుల లక్ష్యం భారత్ జట్టులో ఉన్న పెద్ద స్టార్ల ముందు చిన్నదనే చెప్పాలి. కానీ, ఈ టార్గెట్ ముందు భారత బ్యాట్స్మెన్ నిస్సహాయంగా కనిపించారు. యశస్వి జైస్వాల్ క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే ఎదురుదాడికి దిగాడు, కానీ వరుసగా వికెట్ల పతనం కారణంగా టీమిండియా కోలుకోలేకపోయింది. యశస్వి 65 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
అయితే, జైస్వాల్ తప్ప మిగతా ప్లేయర్లు ఎవరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. రోహిత్ శర్మ 8 పరుగుల వద్ద, శుభ్మన్ గిల్ 23, విరాట్ కోహ్లీ 17, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగుల వద్ద ఔటయ్యారు. రిషబ్ పంత్ ఖాతా తెరవలేకపోయాడు. 21 పరుగులతో వాషింగ్టన్ సుందర్ కాసేపు పోరాడాడు. రవిచంద్రన్ అశ్విన్ 18 పరుగుల వద్ద పెవిలియన్కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 42 పరుగులు చేసినా అది జట్టు వియానికి సరిపోలేదు. న్యూజిలాండ్ తరఫున మిచెల్ సాంట్నర్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీశాడు.