కాగా 2017తో పోల్చితే ఇప్పుడు ఆస్ట్రేలియ టీమ్ మరింత మెరుగ్గా ఉందని, ఈసారి భారత్ ను ఓడించేందుకు కమిన్స్ సేన మెరుగైన ప్రదర్శనలు చేస్తుందని ఆశిస్తున్నట్టు ఒకెఫి చెప్పాడు. 2017 పర్యటనకు వచ్చినప్పుడు ఆడినవారిలో పలువురు ఈ టీమ్ లో ఉన్నారని, వాళ్ల అనుభవం ఈ సిరీస్ లో పనిచేస్తుందని ఒకెఫీ అభిప్రాయపడ్డాడు. స్పిన్ ను బాగా ఆడగలిగే స్మిత్, లబూషేన్, కామోరూన్ గ్రీన్ వంటి బలమైన ఆటగాళ్లు ఈసారి ఉన్నారని తెలిపాడు.