ఈ టెస్టు మ్యాచ్కు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వగా, ఈ మ్యాచ్ సబీనా పార్క్ స్టేడియంలో జరిగింది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది, కానీ పిచ్ చాలా భయంకరంగా మారింది. వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ రక్తం చిందించాల్సి వచ్చింది.
కెప్టెన్ మైక్ ఎర్త్టన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్ స్టీవర్ట్ ఇంగ్లండ్కు ఒపెనింగ్ బ్యాటర్స్ గా గ్రౌండ్ లోకి వచ్చారు. వెస్టిండీస్ ఆ సమయంలో ప్రమాదకరమైన బౌలింగ్కు పేరుగాంచింది. కర్ట్లీ ఆంబ్రోస్-కోర్ట్నీ వాల్ష్ వెస్టిండీస్ తరపున బౌలింగ్ చేయడానికి వచ్చారు.