టీ20 క్రికెట్ చరిత్రలో గొప్పదని భావించదగ్గ మ్యాచ్ లలో గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఒకటి. తొలుత పాకిస్తాన్ ను 159 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తర్వాత లక్ష్య ఛేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 82 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా ( 37 బంతుల్లో 40, 1 ఫోర్, 2 సిక్సర్లు) భారత్ ను ఆదుకున్నారు.