గత నెలలో రమీజ్ రాజా ఐసీసీ ముందు ఓ ప్రతిపాదనను ఉంచనున్నామని వ్యాఖ్యానిస్తూ.. ఈ నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ విషయాన్ని తెరపైకి తెచ్చాడు. టీ20 ప్రపంచకప్-2021 లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు వచ్చిన క్రేజ్, ఆ మ్యాచుకు వచ్చిన టీఆర్పీలు, వ్యూయర్షిప్ చూసిన తర్వాత పీసీబీకి ఓ ఆలోచన వచ్చింది.