అంతగా ప్రాధాన్యం లేని సిరీస్ లకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటుంటే.. రొటేషన్ పాలసీలో భాగంగా మరికొంతమంది సీనియర్ క్రికెటర్లు విరామం తీసుకుంటున్నారు. ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా బీసీసీఐ మాత్రం దీనిని నిరాటంకంగంగా కొనసాగిస్తున్నది. ఈ విధానం వల్లే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతరాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, బిష్ణోయ్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయి.