
రెండో టెస్టులో ఇంగ్లాండ్పై చారిత్రక విజయం అందుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, స్వదేశంలో 21టెస్టు విజయాలు అందుకుని, ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 28 టెస్టుల్లో 21 విజయాలు అందుకోవడం విశేషం...
రెండో టెస్టులో ఇంగ్లాండ్పై చారిత్రక విజయం అందుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, స్వదేశంలో 21టెస్టు విజయాలు అందుకుని, ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 28 టెస్టుల్లో 21 విజయాలు అందుకోవడం విశేషం...
ఇంగ్లాండ్పై టీమిండియాకి ఇదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు 1986లో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ను 279 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా, 2016లో వైజాగ్లో 246 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు 317 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఇంగ్లాండ్పై అతి పెద్ద విజయం నమోదు చేసింది.
ఇంగ్లాండ్పై టీమిండియాకి ఇదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు 1986లో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ను 279 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా, 2016లో వైజాగ్లో 246 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు 317 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఇంగ్లాండ్పై అతి పెద్ద విజయం నమోదు చేసింది.
ఓవరాల్గా టీమిండియాకి ఇది టెస్టుల్లో ఐదో అతిపెద్ద విజయం. ఇంతకుముందు సౌతాఫ్రికాపై 2015లో 337 పరుగుల తేడాతో, న్యూజిలాండ్పై 321, ఆస్ట్రేలియాపై 320, వెస్టిండీస్పై 318 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు....
ఓవరాల్గా టీమిండియాకి ఇది టెస్టుల్లో ఐదో అతిపెద్ద విజయం. ఇంతకుముందు సౌతాఫ్రికాపై 2015లో 337 పరుగుల తేడాతో, న్యూజిలాండ్పై 321, ఆస్ట్రేలియాపై 320, వెస్టిండీస్పై 318 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు....
చెన్నైలోనే జరిగిన మొదటి టెస్టులో ఇండియాలో ఇండియాపై ఇంగ్లాండ్ అతిపెద్ద విజయం అందుకోగా, రెండో టెస్టులో ఇండియా, ఇంగ్లాండ్పై టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం అందుకుంది...
చెన్నైలోనే జరిగిన మొదటి టెస్టులో ఇండియాలో ఇండియాపై ఇంగ్లాండ్ అతిపెద్ద విజయం అందుకోగా, రెండో టెస్టులో ఇండియా, ఇంగ్లాండ్పై టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం అందుకుంది...
ఈ విజయంతో 69.7 శాతం విజయాలతో టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 67 శాతం విజయాలతో ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పటికే ఫైనల్కి అర్హత సాధించిన న్యూజిలాండ్ 70 శాతం విజయాలతో టాప్లో ఉండగా ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.
ఈ విజయంతో 69.7 శాతం విజయాలతో టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 67 శాతం విజయాలతో ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పటికే ఫైనల్కి అర్హత సాధించిన న్యూజిలాండ్ 70 శాతం విజయాలతో టాప్లో ఉండగా ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.
ఆసియాలో వరుసగా ఐదు టెస్టు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి ఇది తొలి పరాజయం. అలాగే వరుసగా ఐదు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ, వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసిన జో రూట్, ఆ రెండు రికార్డులను కొనసాగించలేకపోయాడు...
ఆసియాలో వరుసగా ఐదు టెస్టు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి ఇది తొలి పరాజయం. అలాగే వరుసగా ఐదు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ, వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసిన జో రూట్, ఆ రెండు రికార్డులను కొనసాగించలేకపోయాడు...
ఈ విజయంతో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్గా మహ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో అజారుద్దీన్ 53 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ కూడా 53వ విజయాన్ని అందుకున్నాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 74 విజయాలతో టాప్లో ఉన్నాడు.
ఈ విజయంతో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్గా మహ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో అజారుద్దీన్ 53 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ కూడా 53వ విజయాన్ని అందుకున్నాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 74 విజయాలతో టాప్లో ఉన్నాడు.
2013 నుంచి స్వదేశంలో టాస్ గెలిచిన మ్యాచుల్లో ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు టీమిండియా. 18 మ్యాచుల్లో 16 విజయాలు అందుకోగా, రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి...
2013 నుంచి స్వదేశంలో టాస్ గెలిచిన మ్యాచుల్లో ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు టీమిండియా. 18 మ్యాచుల్లో 16 విజయాలు అందుకోగా, రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి...
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఒక్క ప్లేయర్ కూడా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోగా, భారత బ్యాట్స్మెన్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై మాత్రమే ఈ ఫీట్ సాధించింది టీమిండియా...
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఒక్క ప్లేయర్ కూడా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోగా, భారత బ్యాట్స్మెన్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై మాత్రమే ఈ ఫీట్ సాధించింది టీమిండియా...
రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీతో పాటు బౌలింగ్లో 8 వికెట్లు తీసిన భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు...
రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీతో పాటు బౌలింగ్లో 8 వికెట్లు తీసిన భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు...