Mohammed Shami
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా ఓ స్పిన్ ఆల్రౌండర్, ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫార్ములానే అనుసరిస్తోంది. మిగిలిన ప్లేయర్లు ఉంటే బ్యాటర్లుగా లేదంటే బౌలర్లుగానే ఉంటారు...
వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు. అయితే ఈ ఇద్దరినీ ఒకే మ్యాచ్లో ఆడించేందుకు టీమిండియా సాహసించడం లేదు...
Image credit: PTI
అలాగే హార్ధిక్ పాండ్యా గాయపడితే మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్ ఆశాకిరణంలా కనిపించినా పాండ్యాకి పోటీ అవుతాడనే ఉద్దేశంతో అతన్ని సరిగ్గా వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు టీమిండియా..
Image credit: PTI
‘తరాలు మారుతున్నా టీమిండియా పద్ధతి మాత్రం మారడం లేదు. మహ్మద్ షమీ 8వ స్థానంలో బ్యాటింగ్కి వస్తాడు. తొలి వన్డేలో టీమిండియా 370 పరుగులు చేసినా ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే వచ్చాయి...
మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేయలేరు. తొలుత బ్యాటింగ్ చేశాం కాబట్టి సరిపోయింది, అదే లక్ష్యఛేదనలో ఇలాంటి పరిస్థితి వస్తే... చివర్లో ఓవర్కి 8-10 కావాల్సి వచ్చినా చేయగల బౌలర్లు ఉండాలి...
Image credit: PTI
టీమిండియాలో ఉన్న మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్ కేవలం బౌలర్లు మాత్రమే. వారి బ్యాటింగ్ నైపుణ్యం ఏంటో అందరికీ తెలుసు. టీమిండియా ఆల్రౌండర్లపై ఫోకస్ పెడితే బెటర్...
Image credit: Getty
శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లు తుది జట్టులో ఉంటే చివర్లో అవసరమైతే బ్యాటుతో కూడా రాణించగలరు. హార్ధిక్ పాండ్యా ఒక్కడి మీద ఆధారపడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..