ఇక జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో మాట్లాడతామని ద్రావిడ్ చెప్పాడు. ‘జట్టు ఎంపిక విషయంలో నేను గానీ రోహిత్ శర్మ గానీ ఆటగాళ్లతో మాట్లాడతాం. వాళ్లు ఎందుకు జట్టులో లేరో సరైన కారణాలు వివరిస్తాం. జట్టుకు ఎంపికవని ఆటగాళ్లు బాధకు లోనుకావడం సహజం. అలా అని సదరు ఆటగాళ్లపై నాకు గౌరవం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, స్పష్టత తో ఉండాలని నేను కోరుకుంటాను..’ అని ద్రావిడ్ వివరించాడు.