భారత జట్టు, ఆసియా కప్ కోసం పాకిస్తాన్కి రాకపోతే, తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోమని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కామెంట్లు చేయడం విశేషం. ఈ రెండు టోర్నీలు సజావుగా జరిగితే వచ్చే ఏడాది మరో రెండుసార్లు భారత్, పాకిస్తాన్ మ్యాచులను చూడొచ్చు..