TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..

Published : Mar 28, 2022, 11:30 AM IST

TATA IPL 2022: ఆదివారం పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో ఆర్సీబీ 200 ప్లస్  స్కోరు చేసినా ఓడిన సంగతి తెలిసిందే. 

PREV
17
TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..

కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ఈ సీజన్ ఘనంగా ఆరంభించాలని అనుకుంది. అయితే ఆ మేరకు  తొలుత బ్యాటింగ్ చేసి మెరుపులు మెరిపించింది. 

27

డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లి (41 నాటౌట్), దినేశ్ కార్తీక్ (32 నాటౌట్) లు రెచ్చిపోయి ఆడటంతో  నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ ముందు 206 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

37

అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ ఏం తక్కువ తిన్లేదు.  ఓ ప్రణాళిక ప్రకారం ఆడిన పంజాబ్..  మరో 6 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే పంజాబ్ విజయంలో ఆర్సీబీ  బౌలర్లు ఇచ్చిన పరుగులతో పాటు  ఆ జట్టు చేసిన కీలక తప్పిదం కూడా కారణమైంది. 

47

ఈ మ్యాచులో ఆర్సీబీ ఏకంగా 39 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో పంజాబ్ కు సమర్పించుకుంది. వైడ్ లు,  లెగ్ బైలు, ఓవర్ త్రో ల రూపంలో 39 పరుగులు వచ్చాయి. పంజాబ్ విజయానికి ఇవి కూడా కారణమయ్యాయి. 

57

కాగా,  నిన్నటి  మ్యాచులో ఓటమితో పాటు  ఓ చెత్త రికార్డును కూడా ఆర్సీబీ మూట గట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఎక్స్ట్రా లు ఇచ్చిన జట్టుగా  బెంగళూరు నిలిచింది. గతంలో ఈ రికార్డు..  డెక్కన్ ఛార్జర్స్ పేరిట ఉండేది. 

67

2008లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో డెక్కన్ ఛార్జర్స్.. 38 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకుంది. ఇక ఈ జాబితాలో తర్వాత పంజాబ్ కింగ్స్ కూడా నిలిచింది. 2010 సీజన్ లో   ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓ మ్యాచులో పంజాబ్ కూడా 38 పరుగులు అదనంగా ఇచ్చుకుంది. 

77

ఇప్పుడు ఆర్సీబీ ఈ రెండు జట్ల రికార్డులను బద్దలుకొట్టి అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం.   ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగులలో 39 పరుగులు అదనంగా రాగా.. ఇక పంజాబ్ చేసింది 167 పరుగులే.. 

click me!

Recommended Stories