ముంబై ఇండియన్స్ అయితే, జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఇప్పటికే దీనిపై పలువురు ముంబై అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినట్లు ముంబై మేనేజ్మెంట్ ప్రకటించింది. అయినప్పటికీ శాంతించకుండా ఒక్కరోజులోనే 6 లక్షల మందికి పైగా ముంబై అభిమానులు టీమ్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే, హార్దిక్ పాండ్యా సారథిగా తొలి ఏడాది గుజరాత్ ట్రోఫీ గెలిచినట్లే ముంబైకి టైటిల్ గెలుస్తాడన్న అంచనాలు నెలకొన్నాయి.