అప్పటికే ఆశీష్ నెహ్రా, బుమ్రా, హార్ధిక్ పాండ్యాల కోటా ముగించేశారు. అశ్విన్, జడేజా అప్పటికే భారీగా పరుగులు సమర్పించారు. అదీకాకుండా ఆఖరి ఓవర్లో స్పిన్నర్కి ఇవ్వడం కరెక్ట్ కాదుని భావించిన ధోనీ, కోహ్లీ చేతికి బంతి ఇచ్చాడు. మొదటి రెండు బంతుల్లో సింగిల్ మాత్రమే రాగా ఆ తర్వాత వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు రస్సెల్..