టీ20 వరల్డ్ కప్ మధుర క్షణాలు: ధోని కెప్టెన్సీ మాయ... షర్ట్ విప్పేసి మరీ సంబరాలు

First Published Sep 24, 2019, 3:50 PM IST

టీమిండియా చరిత్రపుట్టల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుల్లో సెప్టెంబర్ 24 ఒకటి. 2007 లో ఇదే తేదీన ధోని సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.   

12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు భారత క్రికెట్లో ఓ అద్భుతం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు 2007 సెప్టెంబర్ 24న టీ20 ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది. ఇలా యావత్ భారతావని సంబరాల్లో మునిగి తేలి 12 ఏళ్లు గడిచిపోయింది. ఈ చారిత్రాత్మకమైన విజయన్ని అందించిన ఈ రోజు భారత క్రికెట్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ వరల్డ్ కప్ విజయమే భారత క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా ఆనాటి మధుర క్షణాలు ఇంకా అభిమానుల మదుల్లో పదిలంగానే వున్నాయి.
undefined
వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే టీ20 ప్రపంచ కప్ ను కూడా నిర్వహించాలన్న ఐసిసి ఆలోచన 2007 కార్యరూపం దాల్చింది. ఇలా ప్రతిష్టాత్మకంగా జరిగిన మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా వేదికయ్యింది. ఈ టోర్నీలో జట్టు పగ్గాలను అప్పుడప్పుడే అందుకున్న మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు.
undefined
ఈ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొన్న ఆటగాళ్లలో కెప్టెన్ ధోని, సీనియర్ ప్లేయర్ యువరాజ్ సింగ్ లకు టీ20 అనుభవముంది. వారిద్దరే అంతకుముందు అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో పాల్గొనగా మిగతావారికి ఈ పార్మాట్ చాలా కొత్తది. ఇలా అనుభవం లేని ఆటగాళ్ల నుండి అద్భుతమైన ఆటను రాబట్టుకుని ధోని కెప్టెన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. లీగ్ దశలో కాస్త తడబడినా మెయిన్ మ్యాచుుల్లో ఓటమన్నదే ఎరగకుండా ధోని సేన మొదటి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించింది.
undefined
లీగ్ దశలో స్కాట్లాండ్ తో జరగాల్సిన మొదటి మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్ టై కాగా బాల్ ఔట్ పద్దతిలో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా టీమిండియా పడుతూ లేస్తూ సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇక వెనక్కితిరిగి చూడకుండా వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది.
undefined
అయితే పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ చివరివరకు తన పోరాటాన్ని కొనసాగించి భారత శిబిరంలో ఆందోళలను రేకెత్తించాడు. చివరి ఓవర్ అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పాక్ విజయానికి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు కేవలం ఒక్క వికెట్ అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోని యువ బౌలర్ జోగిందర్ సింగ్ పై నమ్మకాన్ని వుంచాడు. ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేయకుండా మూడో బంతికే మిస్బా వికెట్ పడగొట్టి చారిత్రక విజయాన్ని భారత్ కు అందించాడు.
undefined
అయితే పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ చివరివరకు తన పోరాటాన్ని కొనసాగించి భారత శిబిరంలో ఆందోళలను రేకెత్తించాడు. చివరి ఓవర్ అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పాక్ విజయానికి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు కేవలం ఒక్క వికెట్ అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోని యువ బౌలర్ జోగిందర్ సింగ్ పై నమ్మకాన్ని వుంచాడు. ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేయకుండా మూడో బంతికే మిస్బా వికెట్ పడగొట్టి చారిత్రక విజయాన్ని భారత్ కు అందించాడు.
undefined
ఇలా ప్రతిష్టాత్మక టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించిన ఆనందంలో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ ధోని ఆనందానికయితే అవద్దులేకుండా పోయింది. అతడు మైదానంలోనే తన చొక్కా విప్పేసి ఓ చిన్నారి అభిమానికి అందించాడు. అలా షర్ట్ లేకుండానే కాస్సేపు సహచరులతో సంబరాలు జరుపుకున్నాడు. ఇలా భారత్ మొదటి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడి 12 ఏళ్లు పూర్తయినా ఆ మధుర జ్ఞాపకాలు అభిమానులు మదుల్లో పదిలంగా వున్నాయి.
undefined
click me!