ఎన్టీఆర్‌తో సూర్యకుమార్ యాదవ్... ఆనందంతో పండగ చేసుకున్న మ్యూచువల్ ఫ్యాన్స్...

First Published Jan 17, 2023, 1:05 PM IST

సగటు భారతీయుడికి ఉండే రెండు కాలక్షేపాలు ఒకటి సినిమా, మరొకటి క్రికెట్.. టీమిండియా ఆడే మ్యాచ్‌‌లకు, ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎగబడే జనాలు, సినిమా థియేటర్ల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రెండు కలిస్తే అభిమానులకు పండగే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి పండగే చేసుకుంటున్నారు.. 

శ్రీలంకతో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో వాలింది. హైదరాబాద్‌కి రాగానే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ని కలిశారు భారత క్రికెటర్లు...

‘RRR’ సినిమాలో ‘కొమురం భీం’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌తో కలిసి ఫోటోలు దిగారు క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, శుబ్‌మన్ గిల్, తదితరులు...

ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి సెపరేట్‌గా ఫోటో దిగారు సూర్యకుమార్ యాదవ్ దంపతులు. దేవిశా, ఎన్టీఆర్‌లపై ఫోటోలు వేసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్, ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మరోసారి కంగ్రాట్స్’ అంటూ పోస్ట్ చేశాడు...

దీనికి ఎన్టీఆర్ కామెంట్ ద్వారా స్పందించాడు. ‘సూర్య, థ్యాంక్యూ సో మచ్. నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. రేపటి మ్యాచ్‌లో దుమ్మురేపు...’ అంటూ కామెంట్ చేశాడు ఎన్టీఆర్.. 

Jr ntr

పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘టెంపర్’ సినిమా నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్ జూనియర్. టీనేజ్ వయసులో ఆకాశమంత క్రేజ్‌ని, సూపర్ స్టార్ స్టేటస్‌ని సంపాదించిన తారక్, వరుస  వైఫల్యాలతో స్టార్ రేసులో కాస్త వెనకబడ్డాడు...

Image: Getty Images

అయితే ‘టెంపర్’ తర్వాత చిన్న ఎన్టీవోడు చేసిన ప్రతీ సినిమా అటు అభిమానులను మాత్రమే కాకుండా సినీ ఫ్యాన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’, కొరిటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’, బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించాడు ఎన్టీఆర్...
 

ప్రతీ సినిమా కథలోనూ వైవిధ్యం చూపించి, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఏరికోరి ఎంచుకున్న ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో నాలుగోసారి చేసిన సినిమా ‘RRR’. గత ఏడాది ఐపీఎల్ సమయంలో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం అందుకుంది...

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో కొమరం భీంగా ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ‘కొమురం భీముడో’ పాటలో తారక రాముడు చూపించిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి హిందీతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు...

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సమయంలో ఎన్టీఆర్‌ని మార్వెల్ స్టూడియో పిలుస్తున్నట్టుగా కథనాలు కూడా వచ్చాయి. హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ స్టూడియో, ఎన్టీఆర్‌ని ఓ క్యారెక్టర్‌ కోసం ఎంచుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. 

ప్రస్తుతం కొరిటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్నాయి. 

click me!