ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఆస్ట్రేలియా.. భారత్ లో మాత్రం తేలిపోతుంది. చివరిసారి ఆ జట్టు ఇక్కడ 2004లో సిరీస్ నెగ్గింది. ఆ తర్వాత 19 ఏండ్లుగా ఆసీస్ కు ప్రతీసారి నిరాశే ఎదురవుతున్నది. అదీగాక 2019-20, 2021 లలో భారత జట్టు.. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించడం కంగారూలకు భారీ షాక్. దీంతో ఈ సారి భారత్ ను స్వదేశంలో ఓడించాలనే పట్టుదలతో ప్యాట్ కమిన్స్ సేన ఉంది.