టీమిండియా వెటరన్ ఆటగాళ్లు తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్ లో ఆడలేదు. ఈ ఇద్దరూ వన్డే, టెస్టులకే పరిమితమవుతారని బీసీసీఐ కూడా ఇప్పటికే సంకేతాలిచ్చింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత జరిగిన న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో పాటు ఇటీవలే భారత్ లో శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో వీళ్లు కనిపించలేదు.