రెండు నెలల పాటు ఐపీఎల్ లో బిజీబిజీగా గడిపిన భారత క్రికెటర్లు ఇప్పుడు మరో కీలక ట్రోఫీకోసం వేట మొదలుపెట్టారు. ఈనెల 7 నుచి 11 దాకా ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో రోహిత్ సేన తలపడనుంది. ఈ మేరకు భారత జట్టు ఇప్పటికే లండన్కు చేరకుని అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.