ఎలా చూసినా ఈ మ్యాచ్ లో ఫలితం తేలడం అయితే పక్కాగానే ఉంది. అయితే అది ఎవరి వైపు నిలుస్తుందోనన్నదే ఆసక్తికరం. క్రీజులో ఛేదనలో మొనగాడు కోహ్లీ, మిడిలార్డర్ ఆపద్బాంధవుడు అజింక్యా రహానే ఉండటంతో పాటు జడేజా, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ లు తలా ఓ చేయి వేస్తే అదేం పెద్ద టార్గెట్ కాదని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.