ఉప్పల్లో కొడితే తుప్పలు దాటి పంజాబ్ లో పడేలా సెంచరీ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ
ఐపీఎల్ 2025 మ్యాచ్ 27వ మ్యాచ్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు, ప్రభుసిమ్రాన్ 42 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.
246 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ సూపర్ నాక్ తో 7 ఓవర్లలోనే హైదరాబాద్ టీమ్ 93 పరుగులు చేసింది. 10 ఓవర్లలో 143/0 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ 2025లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సెంచరీ కొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో 6వ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా తన 141 పరుగుల ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.