• స్మృతి-ప్రతికా జంట ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్లో 1200 పరుగులు జోడించారు. ఇది మహిళల వన్డే చరిత్రలో అత్యధిక రన్రేట్ (6.06) కలిగిన భాగస్వామ్యం.
• ఆస్ట్రేలియాపై వీరి 114 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, 50 ఓవర్ల ఫార్మాట్లో మూడో అత్యధిక స్కోరు. 2009లో క్యారోలిన్ అట్కిన్స్-సారా టేలర్ 119, 2014లో హేలీ మాథ్యూస్-కైషా నైట్ 115 పరుగులు జోడించారు.
• ప్రతికా రావల్ తన 15 వన్డేల్లోనే 750 పరుగులు సాధించి, ఆరు హాఫ్ సెంచరీలు , ఒక సెంచరీ సాధించారు. ఆమె సగటు దాదాపు 58 కావడం విశేషం.
భారత జట్టు బలమైన బ్యాటింగ్ శక్తి
స్మృతి-ప్రతికా జంట విజయవంతంగా ఆరంభం ఇవ్వడంతో పాటు, జట్టులో హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి బ్యాటర్లు ఉండటంతో భారత్ రాబోయే ప్రపంచకప్లో బలమైన జట్టుగా నిలవనుంది.