టోర్నీలో అద్భుతంగా రాణించిన స్మృతి మంధాన, ఫైనల్లో 6 పరుగులకే అవుట్ కావడం, షెఫాలీ వర్మ 11 పరుగులకే పెవిలియన్ చేరడం కూడా భారత జట్టుకి విజయాన్ని దూరం చేశాయి. 65 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్... కీలక సమయంలో అవుట్ కావడం.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించకపోవడం భారత జట్టుకి స్వర్ణాన్ని దూరం చేశాయి.