228 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్, 45.3 ఓవర్లలో 180 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంజమామ్ వుల్ హక్ 41, సయ్యద్ అన్వర్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ 5 వికెట్లు తీయగా జవగళ్ శ్రీనాథ్ 3, అనిల్ కుంబ్లే 2 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు..