టీ20 ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ 5, 7 వ తేదీలలో రెండు టీ20లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో విండీస్ జట్టులోని పలువురు సభ్యులు ముందుగానే అక్కడికి వెళ్లారు. కానీ సీపీఎల్ ఫైనల్ చేరిన జట్లలోని ఉన్న ఆటగాళ్లు అక్టోబర్ 1న వెళ్లడానికి అక్కడి బోర్డు షెడ్యూల్ చేసింది. కానీ షిమ్రన్.. వ్యక్తిగత కారణాల వల్ల తాను అక్టోబర్ 3న ఆసీస్ విమానమెక్కుతానని బోర్డుకు విన్నవించుకున్నాడు.