వన్డే వరల్డ్ కప్లో ఎవరున్నా లేకపోయినా శిఖర్ ధావన్ ఉండాల్సిందే... దినేశ్ కార్తీక్ కామెంట్..
First Published Nov 28, 2022, 12:44 PM ISTఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత శిఖర్ ధావన్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2022 రిటెన్షన్ దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్లో మూడు సీజన్లుగా అదరగొడుతున్నా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ధావన్ని పూర్తిగా టీ20లకు దూరం చేసిన టీమిండియా, వన్డేల్లో మాత్రమే ఆడిస్తోంది..