భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీని టీ20లలో ఆడించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు మదన్ లాల్ సెలక్టర్ల పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో షమీ.. అత్యుత్తమ బౌలర్లలో ఒకడని, ఈ ఫార్మాట్ లో పరుగులు నియంత్రించేవారికంటే వికెట్లు తీసే బౌలర్లు భారత జట్టుకు అవసరమని అన్నాడు.