టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు లేకుండానే కివీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు టీ20లలో హార్ధిక్ పాండ్యా, వన్డే లలో శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు.