ఇదిలాఉండగా.. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. రావల్పిండి టెస్టు ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ టెస్టు టీమ్లోని ప్లేయర్లు, అంతుచిక్కని వైరస్ బారిన పడ్డారు. కెప్టెన్ బెన్ స్టోక్స్తో పాటు 11 మంది టీమ్ ప్లేయర్లు అనారోగ్యానికి గురయ్యారు. టీమ్ ప్లేయర్లతో పాటు మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా అనారోగ్యానికి గురి కావడం, పాక్లో ఉగ్రదాడులు జరుగుతుండడంతో ఇంగ్లాండ్ టీమ్ భయాందోళనలకు గురవుతోంది.