దీంతో అతడు తన ఫామ్ ను తిరిగి పొందడానికి సెలక్టర్లు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోహ్లీ ఫామ్ అందుకుంటాడని.. ఇరగదీస్తాడని, ఇక రికార్డులు బద్దలే అని అతడి అభిమానులు నానా హంగామా చేశారు. కానీ కోహ్లీ మాత్రం వాళ్ల ఆశల్ని అడియాసలు చేస్తూ ఒక్క మ్యాచ్ లో కూడా 25 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. ఈ పర్యటనలో ఓ టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డేలు ఆడిన అతడు.. మొత్తం కలిపి చేసింది 80 పరుగుల లోపే..