సంజూ శాంసన్ ఫ్యాన్స్‌ని చల్లార్చే పనిలో టీమిండియా... సౌతాఫ్రికా సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!...

First Published Sep 27, 2022, 2:53 PM IST

సంజూ శాంసన్... సౌత్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్. ముఖ్యంగా కేరళలో సంజూ శాంసన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మరే క్రికెటర్ కూడా లేదు. టీ20 వరల్డ్  కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడంతో కేరళ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

తిరువనంతపురం వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగే టీ20 మ్యాచ్‌లో నిరసన జ్వాలలు వినిపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు సంజూ శాంసన్ ఫ్యాన్స్. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ముగించుకుని కేరళ చేరుకున్న టీమిండియాకి ఇదే రకమైన అనుభవం ఎదురైంది...

కేరళ చేరిన టీమిండియా ప్లేయర్ల కోసం వేచి ఉన్న క్రికెట్ ఫ్యాన్స్... ‘సంజూ... సంజూ...’ అంటూ అరుస్తూ గోల గోల చేశారు. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. సంజూ శాంసన్ అభిమానుల గోల తట్టుకోలేక సూర్యకుమార్ యాదవ్, తన ఫోన్‌లో సంజూ ఫోటోను చూపించాడు...

న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్‌లో టీమిండియా ఏకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్... సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం...

Sanju Samson

అక్టోబర్ 6 నుంచి 11 వరకూ మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది టీమిండియా. సౌతాఫ్రికాతో జరిగే ఈ వన్డే సిరీస్‌కి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే టీమ్ ప్లేయర్లందరికీ ఈ వన్డే సిరీస్ నుంచి రెస్ట్ కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్...

Sanju Samson

హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లు అందరూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతున్నారు. దీంతో శిఖర్ ధావన్‌కి వైస్‌గా సంజూ శాంసన్ వ్యవహరించబోతున్నాడని సమాచారం... 

లక్నో, రాంఛీ, ఢిల్లీ వేదికల్లో జరిగే వన్డే సిరీస్‌లో భారత్ ఏ జట్టు తరుపున ఆడిన రుతురాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా వంటి ప్లేయర్లకు చోటు దక్కనుందని అంచనా...  

click me!