సెమీస్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పజెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. రోహిత్ ను టెస్టు, వన్డేలకు పరిమితం చేసి టీ20 పగ్గాలను పాండ్యాకు అప్పజెప్పి జట్టులో ప్రక్షాళన చేయాలని సూచిస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.