135 బంతుల్లో 17 ఫోర్లు, ఓ సిక్సర్తో 141 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, టీమిండియా తరుపున ఒంటరి పోరాటం చేశాడు. రాహుల్ ద్రావిడ్ 36, వీరేంద్ర సెహ్వాగ్ 26, యువరాజ్ సింగ్ 19, రమేశ్ పవార్ 18, సౌరవ్ గంగూలీ 15 పరుగులు చేయగా మహ్మద్ కైఫ్ 7, వీవీఎస్ లక్ష్మణ్ 4 పరుగులు చేశారు. ఫలితం 330 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా 12 పరుగుల తేడాతో ఓడింది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఎక్స్ట్రాల రూపంలో టీమిండియాకి 37 పరుగులు రాగా, భారత బ్యాటర్లలో ఎవ్వరూ ఎక్స్ట్రాల ద్వారా వచ్చిన పరుగులను కూడా అందుకోలేకపోయారు...