మొదటి రౌండ్లో నాలుగు టీమ్స్ని ఓడించిన ముంబై ఇండియన్స్, రెండో రౌండ్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. గుజరాత్ జెయింట్స్తో జరిగిన రెండో మ్యాచ్లో 55 పరుగుల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ చరిత్రలో మొదటి ఐదుకి ఐదు మ్యాచుల్లో నెగ్గిన మొట్టమొదటి టీమ్గా నిలిచింది ముంబై ఇండియన్స్...