రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత్ 308 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శుభ్మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉండగా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ ను పెద్ద స్కోర్ చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. సూపర్ బౌలింగ్ తో బంగ్లా టీమ్ ను 149 పరుగులకే పరిమితం చేశారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రాకు తోడుగా మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, ఆకాశ్ దీప్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు అశ్విన్ సూపర్ సెంచరీ (113 పరుగులు), జడేజా హాఫ్ సెంచరీ (86 పరుగుల) ఇన్నింగ్స్ లతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌట్ అయింది.