బుమ్రా నాలుగు కీకలమైన వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 4/50 వికెట్లలో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (2), వారి టాప్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (8)తో పాటు హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్లను అవుట్ చేశాడు. టీ బ్రేక్ ముందు హసన్ మహ్మద్ను ఔట్ చేయడంతో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల మార్కును అందుకున్నాడు.
మిగిలిన వికెట్లు మహ్మద్ సిరాజ్ (2/30), రవీంద్ర జడేజా (2/19), ఆకాష్ దీప్ (2/19) లు తీసుకున్నాడు. సిరాజ్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో చివరి వికెట్గా నహిద్ రానాను 11 పరుగుల వద్ద ఔట్ చేశాడు. బంగ్లా ప్లేయర్లలో సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ (32), వికెట్ కీపర్-బ్యాటర్ లిట్టన్ దాస్ (22) మధ్య 51 పరుగుల ఘన భాగస్వామ్యానికి ముందు టైగర్స్ 40/5కి తగ్గిన తర్వాత 100 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశాన్ని ఉన్నది.
ఆల్-రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ మిగిలిన టెయిల్-ఎండర్లతో పోరాడేందుకు ప్రయత్నించాడు, ఇన్నింగ్స్లో కేవలం సిక్స్తో సహా 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కానీ, చివరికి అతని జట్టును 150 మార్కును దాటించడంలో విఫలమయ్యాడు. భారత్ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. 81-3 పరుగులతో క్రీజులో శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నిరాశపరిచారు.
అంతకుముందు రోజు రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులతో పాటు రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56) అర్ధ సెంచరీలతో భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ను 376-10 పరుగులతో ముగించింది.