ఒకే ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా టీమిండియాకు సరికాదనే ఉద్దేశంతోనే రోహిత్ ను వన్డే లకూ నాయకుడిగా నియమించామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. కోహ్లీకి కూడా ఈ విషయం చెప్పామని, అయితే అతడు తమ మాట వినకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించిన విషయం తెలిసిందే.