కేవలం ఈ స్టార్ సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాదు ముఖ్యంగా భారత జట్టులోని ఆల్ రౌండర్లు అద్భుతంగా రాణించడంతో టీమ్ తన జైత్రయాత్రను కొనసాగించిందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. పాంటింగ్ ఐసీసీ డిస్కషన్ లో మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నమెంట్ అంతటా భారత జట్టు ఆల్ రౌండర్లు అద్భుతంగా రాణించారనీ, అవసరమైన సమయంలో తమ సత్తా చూపించారని కొనియాడారు.
"రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా బాగా ఆడారు. ఇండియా జట్టులో సమతూకం, యంగ్ ప్లేయర్స్, సీనియర్ల అనుభవం కలయిక ఉండటం వల్ల వాళ్లను ఓడించడం ఇతర జట్లకు కష్టంగా మారింది. ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ తన జట్టు కోసం బాగా ఆడాడు" అని పాంటింగ్ అన్నాడు.