రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి తన స్వంత ఊరుకు వెళ్తూ రూర్కీ వద్ద కారు ప్రమాదానికి గురికావడంతో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి ఆరోగ్యం గురించి తన సహచర ఆటగాళ్లు, క్రికెట్ ప్రముఖులే గాక సినీ, రాజకీయ నాయకులు కూడా వాకబు చేస్తున్నారు.