ఇక ఈ టెస్టులో రోహిత్ ఆడేది అనుమానమే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రోహిత్ ఇప్పుడప్పుడే కోలుకునేట్టు కనిపించడం లేదని.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథ్య పగ్గాలు చేపడతాడని బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి తెలిపాడు. బుమ్రా కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పితే కపిల్ దేవ్ తర్వాత భారత టెస్టు జట్టుకు సారథ్యం వహించే తొలి సారథి కానున్నాడు.