సఫారీ సిరీస్ లో రోహిత్ ప్లేస్ ను రిషభ్ పంత్ తో పూరించారు సెలక్టర్లు. ఇక ఇంగ్లాండ్ తో ఎవరు టెస్టు కెప్టెన్ గా ఉంటారో తేలాల్సి ఉంది. రోహిత్ కు కరోనా.. సిరీస్ లకు విరామం నేపథ్యంలో అతడికి టీ20 బాధ్యతల నుంచి తప్పించిందే ఉత్తమమంటున్నాడు మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అప్పుడైనా హిట్ మ్యాన్ పై ఒత్తిడి, పనిభారం తగ్గి వన్డేలు, టెస్టుల మీద పూర్తిస్థాయి ఫోకస్ పెడతాడని అంటున్నాడు.