భారత దిగ్గజ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ రికార్డును కూడా రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ను అధిగమించి నాలుగో ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 10768 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ (13872) రెండో స్థానంలో, సౌరవ్ గంగూలీ (11221) మూడో స్థానంలో, రోహిత్ శర్మ (10,831 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నారు.