ఐపీఎల్ 2021 ముందు రోహిత్ శర్మకు రెస్టు... హిట్‌మ్యాన్‌తో పాటు ఆ ఇద్దరికి కూడా...

First Published Mar 2, 2021, 9:53 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఈ టోర్నీలకు రొటేషన్ పద్ధతిలో ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బుమ్రాకి విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే.

టీ20 సిరీస్‌ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు విశ్రాంతి కల్పించాలని భావిస్తోందట బీసీసీఐ.
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో పాల్గొనలేదు... మొదటి రెండు టెస్టుల్లో కూడా పాల్గొనని రోహిత్ శర్మ, ఆఖరి రెండు టెస్టుల్లో ఆడాడు.
undefined
ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్నాడు.రెండో టెస్టులో అద్భుత సెంచరీ చేసిన రోహిత్ శర్మ, మూడో టెస్టులో 91 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు...
undefined
టెస్టు సిరీస్ తర్వాత జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ రోహిత్ శర్మ పాల్గొనబోతున్నాడు. వన్డే సిరీస్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కాబోతుండడంతో బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించాలని భావిస్తోంది బీసీసీఐ.
undefined
అలాగే ఆస్ట్రేలియాలో రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్, బిజీ క్రికెట్ ఆడుతున్నాడు. మూడు టెస్టుల్లోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్, భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు... గబ్బా టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టుకి విజయాన్ని అందించాడు.
undefined
అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాడు వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్నాడు...
undefined
తుదిజట్టులో చోటు లేకపోయినా ప్రాక్టీస్ సెషన్స్‌లో, బయో బబుల్‌లో జీవితాన్ని గడుపుతున్న క్రికెటర్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. దీన్ని తగ్గించేందుకు రొటేషన్ పద్ధతిలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
undefined
పెటర్నిటీ లీవ్ ద్వారా ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు బిజీ క్రికెట్ ఆడనున్నాడు.
undefined
రిషబ్ పంత్, రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తే కొన్నాళ్లుగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేక, రెస్టు తీసుకుంటున్న కెఎల్ రాహుల్‌ వరుసగా మ్యాచులు ఆడనున్నాడు. వికెట్ కీపర్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ ఈ సిరీస్‌ల్లో కీలకం కానున్నాడు..
undefined
అలాగే టీ20 సిరీస్‌కి ఎంపికైన జార్ఖండ్ డైనమెట్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌‌ను కూడా వికెట్ కీపర్‌గా పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్‌, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడంతో అతనికి మళ్లీ టీమిండియా పిలుపు వస్తుందా? అనేది అనుమానమే.
undefined
click me!