టెస్టుల్లో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్లు
39 - మహేంద్ర సింగ్ ధోనీ (144 ఇన్నింగ్స్లు)
18 - ఫరూక్ ఇంజనీర్ (87 ఇన్నింగ్స్లు)
18 - రిషబ్ పంత్ (62 ఇన్నింగ్స్లు)
14 - సయ్యద్ కిర్మాణీ (124 ఇన్నింగ్స్లు)
ఒక్కపరుగు దూరంలో సెంచరీ కోల్పోయిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ ఒక్క పరుగు దూరంలో తన సెంచరీని కోల్పోయాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. భారత్ తరఫున టెస్టుల్లో 90+ పరుగుల వద్ద అత్యధిక ఔట్లు అయిన ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
10 - సచిన్ టెండూల్కర్
9 - రాహుల్ ద్రవిడ్
7 - రిషబ్ పంత్
5 - సునీల్ గవాస్కర్
5 - ఎంఎస్ ధోని
5 - వీరేంద్ర సెహ్వాగ్
ఇక రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ మాత్రమే 90+ పరుగుల వద్ద ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు టెస్టుల్లో అవుట్ అయిన వికెట్ కీపర్లుగా ఉన్నారు.